telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కొత్తగా 2,817 కోవిడ్ కేసులు

Corona

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకు భారీ సంఖ్యలో కేసులు నమదవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం… రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,817 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,611 మంది కోలుకున్నారు. మరోపక్క రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య లక్ష దాటింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,33,406కి చేరింది. తెలంగాణలోని ఆసుపత్రుల్లో 32,537 మందికి చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 1,00,013 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య 856కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 452 కరోనా భారీనపడ్డారు.

Related posts