telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

శ్రీశైలం ప్రాజెక్ట్ కు పోటెత్తుతున్న వరద

srisailam project with full of water

శ్రీశైలం ప్రాజెక్ట్ జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో డ్యాంకు వరద పోటెత్తుతోంది. తుంగభద్ర, జూరాల, హంద్రీల నుంచి శ్రీశైలం డ్యాంకు 1,60,087 క్యూసెక్కుల వరద వస్తోంది. డ్యాం నీటి మట్టం ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం డ్యాంలో 214.3637 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంంలో వివిధ మార్గాల ద్వారా 1,60,144 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడుకు 5 వేలు, కల్వకుర్తికి 2,400, హంద్రీనీవాకు 2,026 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Related posts