ముంబైలో డ్రగ్స్తో టాలీవుడ్ నటి దొరికిపోవడం కలకలం సృష్టిస్తోంది… ఇక, ఆ నటికి మాఫియాతో సంబంధాలు ఉండడం సంచలనంగా మారిపోయింది.. టాలీవుడ్ నటి.. మాఫియాడాన్ కరీం లాలతో కలిసి డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్టు ఎన్సీబీ అధికారులు గుర్తించారు.. తాజాగా.. బాంద్రా, కుర్ల, అందేరిలో జరిపిన దాడుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు.. మీరా రోడ్డులోని హోటల్లో జరిపిన దాడిల్లో హీరోయిన్తో పాటు మరో ఇద్దరిని కూడా ఎన్సీబీ పట్టుకుంది.. వీరి వద్ద నుంచి 400 గ్రాముల డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నటితో పాటు చాంద్, సయ్యద్ అనే వ్యక్తులను కూడా అరెస్ట్ చేసింది ఎన్సీబీ.. కీలకంగా మారిన మాఫియా డాన్ కరీం లాలా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.. ఇదే సమయంలో కరీం దేశం విడిచి పారి పోకుండా ఉండేందుకు లూక్ ఔట్ నోటీసు జారీ చేసింది ఎన్సీబీ.. కరీం లాలా కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్ పోర్ట్ లను అప్రమత్తం చేశారు. కాగా, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు డ్రగ్స్ సంబంధంలు ఇప్పుడు కలవరపెడతున్నాయి.. బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం తర్వాత చాలా లింక్లు బయటకు వచ్చాయి. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.
previous post