telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దుబ్బాక ఉప ఎన్నిక బరిలో విజయశాంతి..?

vijayashanthi

మెదక్ జిల్లా దుబ్బాక టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో  దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, సీనియర్ నేత విజయశాంతి రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది.

విజయశాంతి బరిలోకి దింపడం ద్వారా ఆ స్థానాన్ని కొల్లగొట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో మెదక్ ఎంపీగా ఉమ్మడి మెదక్ జిల్లాపై ఆమెకు మంచి పట్టుంది. పార్టీలకతీతంగా అన్ని గ్రామాల్లోనూ ఆమెకు పరిచయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను బరిలోకి దింపడం ద్వారా లబ్ధిపొందాలని కాంగ్రెస్ యోచిస్తోంది.

2014 ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన విజయశాంతి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో దుబ్బాకకు సరైన అభ్యర్థి లేకున్నా రెండోస్థానాన్ని దక్కించుకోగలిగింది. దీంతో ఇప్పుడు విజయశాంతిని బరిలోకి దింపడం ద్వారా ఆ సీటును కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Related posts