telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

సినీ ఫక్కీలో సెల్‌ఫోన్ల కంటెయినర్ హైజాక్!

crime

సినీఫక్కీలో ఓ సెల్‌ఫోన్ల కంటెయినర్ ను దుండగులు హైజాక్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన తమిళనాడులోని పొన్‌పాడి చెక్‌పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. తమిళనాడు నుంచి ముంబైకి దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన సెల్‌ఫోన్లతో బయలుదేరిన ఓ కంటెయినర్ లారీని వెంబడించిన దుండగులు పొన్‌పాడి చెక్‌పోస్టు వద్ద సరుకు ఉన్న లారీని అడ్డగించి డ్రైవర్‌ను కొట్టి కంటెయినర్‌ను తీసుకెళ్లారు.

శ్రీపెరంబదూరు నుంచి ఎంఐ (రెడ్‌మి) కంపెనీకి చెందిన సెల్‌ఫోన్ల లోడుతో ఓ కంటెయినర్ లారీ మంగళవారం రాత్రి ముంబైకి బయలుదేరింది. మరో లారీతో ఆ లారీని వెంబడించి అందులో ఉన్న 16 బాక్సుల్లో 8 బాక్సులను (దాదాపు రూ. 5 కోట్ల విలువ) దోచుకుని లారీని అక్కడే వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కంటెయినర్ లారీని నిన్న స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు.

Related posts