సీనియర్ నటి షకీలా సెన్సార్ బోర్డు తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆమె నటిస్తూ నిర్మించిన “లేడీస్ నాట్ అలౌడ్” సినిమాను సెన్సార్ చేయడానికి సెన్సార్ బోర్డు రెండుసార్లు తిరస్కరించింది. అయితే ఈ సినిమాను సెన్సార్ చేయడానికి కొందరు వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని షకీలా ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “లేడీస్ నాట్ అలౌడ్ చిత్రంలో నటించడమే కాదు.. నిర్మాతగా కూడా వ్యవహరించాను. సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తయినప్పటికీ సెన్సార్ బోర్డు మాత్రం సినిమాను సెన్సార్ చేయడానికి రెండుసార్లు తిరస్కరించింది. అందుకు గల కారణాలేంటో తెలియడం లేదు. మేమెంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాం. ఈ జోనర్లో వచ్చిన చాలా చిత్రాలకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ మా సినిమాను తిరస్కరించడానికి కారణమేంటో తెలియడం లేదు. నా పేరు కారణమా? సాయిరాంగారు కారణమా? అని తెలియడం లేదు. చిన్న నిర్మాతలు బ్రతకకూడదా? మేం మనుషులం కాదా? ట్రిబ్యునల్కి వెళితే ఎంతో ఖర్చు అవుతుంది. ఈ చిత్రం ఫ్యామిలీ చిత్రం కాదని.. అడల్డ్ కామెడీ సినిమా అని కూడా మేం ముందుగానే చెప్పాం. సినిమాలో మేమెక్కడా విజువల్గా తప్పుగా చూపించలేదు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్కి అయిన ఖర్చు సెన్సార్కు అవుతుంది. సెన్సార్ బోర్డుకు ఇవ్వాల్సిన పేమెంట్ ఇచ్చేశాం. అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసు. అందుకు సంబంధించిన రికార్డింగ్స్ మా వద్ద ఉన్నాయి. మీ మంచి కోసం వద్దని అనుకుంటున్నాను” అంటూ సెన్సార్ బోర్డుకు షకీలా వార్నింగ్ ఇచ్చారు.
పవర్ స్టార్ అభిమానులు ఎలా ఫీల్ అవుతారో అదే “పవర్ స్టార్” : ఆర్జీవీ