telugu navyamedia
సినిమా వార్తలు

వేణుమాధవ్ మృతి తీవ్రంగా కలచివేసింది : మహేష్ బాబు

even I donot get ticket in AMB said mahesh

ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కొద్ది సేప‌టి క్రితం క‌న్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 12:21 నిమిషాలకు వేణుమాధవ్ తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. వెండితెర‌పైనే కాదు బుల్లితెర‌పై కూడా ఆయ‌న రాణించారు. ప‌లు కార్య‌క్ర‌మాల‌కి ఆయ‌న యాంక‌ర్‌గా కూడా ప‌ని చేశారు. రాజ‌కీయాల‌లోను చురుకుగా ప‌ని చేవారు. దాదాపు 600కి పైగా సినిమాల‌లో నటించిన వేణు మాధవ్ హంగామా, భూ కైలాస్ చిత్రాల‌లో హీరోగా చేశారు. ఆయ‌న‌కి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అనారోగ్య కార‌ణాల వ‌ల‌న ఐదేళ్లుగా సినిమాల‌కి దూరంగా ఉన్నారు వేణు మాధ‌వ్. చివ‌రిగా రుద్ర‌మ‌దేవి చిత్రంలో కనిపించారు. వేణు మాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం తెలియజేశారు. “వేణుమాధవ్ గారి మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అంటూ ట్వీట్ చేశారు. వేణుమాధవ్ యువరాజు, పోకిరి, అతిథి లాంటి మహేష్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.

Related posts