టీవీ షో లలోకెల్లా బాప్ అని పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో ప్రసారం అవుతున్న సంగతి అందరికి తెలిసిందే… గత రెండు సంవత్సరాలుగా ఘన విజయం సాధించిన టీవీ షో ప్రస్తుతం వివాదాలకు దారీ తీస్తుంది. మొత్తం 100 రోజుల పాటు 16 మంది సభ్యులు ఒకే ఇంటిలో ఉండి వారి జీవితంలో జరిగిన విషయాలను సాధారణ ప్రజలుగా ఒకరికొకరు తెలుసుకుంటారు. బిగ్ బాస్ షోలో నటించిన వారు టాస్క్ ల ఆధారంగా ఎలిమినేట్ అవుతూ… చివరకు ఒక్కరే విజేతగా నిలుస్తారు. ప్రస్తుతం ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్న బిగ్ బాస్ సిరిస్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు వివాదాలకు దారి తీస్తుంది. బిగ్బాస్ షో అంటేనే నచ్చదని చెప్పిన నాగార్జునను హోస్ట్గా తీసుకోవడం దగ్గర నుంచి పార్టిసిపెంట్స్ ఎంపిక వరకు ప్రతిదీ వివాదాస్పదంగా మారింది. నటి గాయత్రి గుప్తా, జర్నలిస్ట్ శ్వేతారెడ్డి బిగ్బాస్ నిర్వాహకులపై కాస్టింగ్ కౌచ్ కింద బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా బిగ్బాస్ షోను ఆపేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలుగు బిగ్బాస్-3 షోపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు యాంకర్ శ్వేతారెడ్డి, టాలీవుడ్ నటి గాయత్రీ గుప్తా మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. బిగ్బాస్ షో ముసుగులో అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మా బాస్ని ఎలా సంతృప్తిపరుస్తారని అడుగుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని.. రేపు రిట్ పిటిషన్ విచారణకు రానుందని శ్వేతారెడ్డి తెలిపారు. తాను, గాయత్రీ గుప్తా కలిసి పిటిషన్ వేస్తున్నామని శ్వేతారెడ్డి తెలిపారు.
previous post