telugu navyamedia
సినిమా వార్తలు

నడిఘర్ సంఘం ఎన్నికలు రద్దు… ఎందుకంటే…!?

Vishal-and-Karthi

న‌డిఘ‌ర్ సంఘానికి 2019 – 2022 ఏడాదికిగానూ రానున్న 23వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విశాల్‌ పాండవర్‌ జట్టు, కే.భాగ్యరాజ్‌ స్వామిశంకరదాస్‌ జట్టు బరిలోకి దిగుతున్నాయి. రెండు జట్ల నుంచి జోరుగా ప్రచారం కూడా సాగింది. అయితే తాజాగా ఈ ఎన్నికలు రద్దైనట్లుగా తెలుస్తోంది. ముందుగా ఈ ఎన్నిక‌ల‌ను ఎంజిఆర్ జాన‌కి కాలేజ్‌లో నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. అయితే అక్క‌డ నిర్వ‌హిస్తే ట్రాఫిక్ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని, ఈ ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌మ‌ని హైకోర్టు కోరడం ఒక కారణమైతే… అదే స‌మ‌యంలో ఈ ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఈరోజు సొసైటీ రిజిస్ట్రార్ ప్రకటించడం మరో కారణం. 61 మంది స‌భ్యులు త‌మ ఓటు హ‌క్కును విశాల్ బృందం తొల‌గించింద‌ని రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయడంతో రిజిస్ట్రార్ ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేశారు. అయితే ఎన్నిక‌ల స‌మ‌యంలో తమ‌ని సంప్ర‌దించ‌మ‌ని కోరిన‌ప్పుడు 61 మంది సంప్ర‌దించ‌లేద‌ని విశాల్ బృందం చెబుతోంది. న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల‌ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వ‌హించాల‌ని కోరుతూ విశాల్ బృందం గ‌వ‌ర్న‌ర్‌ను సంప్ర‌దించి విన‌తి ప‌త్రాన్ని స‌మ‌ర్పించింది. న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లను ఎప్పుడు నిర్వ‌హిస్తారో తెలియాల్సి ఉంది.

Related posts