telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

లాక్‌డౌన్‌తో ప్రయోజనం ఉండదు: మంత్రి తలసాని

talasani srinivas yadav

  హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కరోనాను ఎదుర్కొనే క్రమంలో లాక్‌డౌన్ వల్ల ప్రయోజనం ఉండదని చెప్పారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటేనే వైరస్‌ను కట్టడి చేయొచ్చని తెలిపారు. కరోనా వచ్చి పోతుంటుందని ఆయన అన్నారు.

మంత్రి మహమూద్ అలీతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్ కనపడకుండా పోయారని, ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని టీపీసీసీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై తలసాని మండిపడ్డారు.

కేసీఆర్ కనపడకపోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోతున్నాయా? అని ప్రశ్నించారు. నిన్న వ్యవసాయ అధికారులతో కేసీఆర్ ఫోనులో మాట్లాడారని ఆయన తెలిపారు. బీజేపీ నేతలు కూడా కరోనాపై బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వారికి చేతనైతే ప్రధాని మోదీతో మాట్లాడి దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టించాలని అన్నారు. 

 

Related posts