telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ఇద్దరు సిట్‌ పోలీసులను కాల్చిచంపిన దుండగులు

gun firing

బీహార్‌ రాష్ట్రంలో సిట్‌ కు చెందిన ఇద్దరు పోలీసులను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. ఈ ఘటన సరన్‌ జిల్లాలో జరిగింది. దుండగుల దాడిలో మరో పోలీసు తీవ్రంగా గాయపడ్డారు. అయితే చప్రాలోని మార్కెట్‌ ఏరియాలో క్రిమినల్స్‌పై దాడి చేసి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసుల వద్ద ఉన్న ఏకే-47, రెండు తుపాకులను క్రిమినల్స్‌ దొంగిలించారు. పోలీసులు హత్యకు గురైన ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. మృతులను సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మిథిలేష్‌ కుమార్‌ షా, కానిస్టేబుల్‌ మహ్మద్‌ అఫ్రోజ్‌గా గుర్తించారు. గాయపడిన కానిస్టేబుల్‌ను హవల్దార్‌ రాజ్‌నీష్‌ ను ఆస్పత్రికి తరలించారు.

Related posts