telugu navyamedia
రాజకీయ వార్తలు

దేశవ్యాప్తంగా పౌర ప్రకంపనలు.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

hyderabad students rali

పౌరసత్వం సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలకు పేర్కొంది.

హింసను ప్రేరేపించేలా అసత్య వార్తలు ప్రసారం చేసేవారిపైనా, సోషల్ మీడియా పోస్టులపైనా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ సూచించింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి.

Related posts