ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో వైరల్ అవుతుంది. ఎందుకంటే… ప్రతీ చేతిలో స్మార్ట్ఫోన్.. అందులో కావాల్సినన్ని సోషల్ మీడియా యాప్స్.. ఇంకేముందు.. తమకు వెరైటీగా ఏది కనిపించినా.. షేర్ చేస్తున్నారు.. కాస్త భిన్నంగా తోచిందంటే షేర్ చేసేస్తున్నారు.. అది కాస్త లైకులు, షేర్లు, కామెంట్లతో నెట్టింట్లో వైరల్గా మారిపోతున్నాయి.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ప్రామిసరీ నోటు తెగ తిరిగేస్తోంది.. అది అంతలా అందరినీ ఆకర్షించడానికి ప్రధాన కారణం ఏంటంటే.. డిసెంబర్ 31న పార్టీ కోసం రూ.15,000 అప్పుగా తీసుకున్నాడు ఓ యువకుడు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలానికి చెందిన అంజి అనే యువకుడు.. ఓ వ్యక్తి నుంచి డిసెంబర్ 31న దావత్ కోసం.. రూ.15 వేలు అప్పుగా తీసుకున్నాడు.. దీనికి నెలకు రూపాయిన్నర చొప్పున మిత్తి చెల్లించడానికి అంగీకరించాడు.. దీనికోసం ప్రామిసరీ నోటు కూడా రాసి ఇచ్చాడు.. దానిపై మరో ఐదుగురు వ్యక్తులతో సాక్షి సంతకాలు కూడా చేయించాడు.. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 31 దావత్ అయిపోయింది.. జనవరి 1 కూడా అయిపోవచ్చింది కానీ.. 31న ఆ యువకుడు రాసిచ్చిన నోట్ మాత్రం ఔరా! అనేలా చేస్తోంది. కాగా, భారీ ఈవెంట్లు, పార్టీలు లేకుండానే సైలెంట్గా పనికానిచ్చేశారు మందుబాబులు.
previous post
next post
జగన్ పాదయాత్రల్లో అరెస్టులు జరిగాయా?: అశోక్ గజపతిరాజు