అమరావతిలో అయోధ్య తరహా రామాలయ నిర్మాణంపై బీజేపీ నేత సుజనా చౌదరి స్పనించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అఖిల భారత హిందూ మహాసభ రామాలయాన్ని నిర్మిస్తామని ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నాని తెలిపారు. రామాలయం నిర్మాణం వల్ల మన రాజధాని అమరావతి ఆధ్యాత్మిక నగరంగా శోభిల్లుతుంది. ఆలయ నిర్మాణానికి నా వంతుగా రూ.10,01,116 విరాళం ప్రకటిస్తున్నానని తెలిపారు.
అమరావతిలో దక్షిణ భారత రామాలయాన్ని నిర్మిస్తామని అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్ ఇటీవల ప్రకటించారు. అమరావతి దక్షిణ భారత దేశానికి అయోధ్యవంటిదని ఆయన అన్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎలా జరుగుతుందో అదే రీతిలో అమరావతిలోనూ దక్షిణ భారత రామాలయం నిర్మిస్తామని అమరావతి జేఏసీ గౌరవ చైర్మన్ జీవీఆర్ శాస్త్రి కూడా ఇటీవల తెలిపారు.