మన దేశంలో వ్యాక్సినేషన్ ను వేగంగా అమలు చేస్తున్నా రెండు డోసులు ఇవ్వడానికి అధిక సమయం పడుతున్నది. దేశంలో కోట్లాది మందికి వ్యాక్సిన్ అందించాలి అంటే ఎన్ని డోసులు అవసరం అవుతాయో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మే 1 నుంచి రష్యాకు చెందిన స్పుత్నిక్ వి కూడా అందుబాటులోకి వచ్చింది. కాగా, ఇప్పుడు మరో వ్యాక్సిన్ ఇండియాలో అందుబాటులోకి రాబోతున్నది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా సంస్థ జైకోవ్ డి అనే వ్యాక్సిన్ ను రెడీ చేస్తోంది. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అతి త్వరలోనే మధ్యంతర ఫలితాలు రాబోతున్నాయి. ఫలితాలు వచ్చిన వెంటనే అత్యవసర వినియోగానికి సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ నెలలోనే ఈ వ్యాక్సిన్ కు అనుమతులు లభిస్తాయని, అనుమతులు లభించిన వెంటనే ఉత్పత్తి ప్రారంభిస్తామని జైడస్ క్యాడిలా పేర్కొన్నది.
previous post
next post