telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ట్విట్టర్ పిట్ట కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు: లక్ష్మణ్

BJPpresident -K-Laxman

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను ట్విట్టర్ పిట్టగా అభివర్ణిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. విభజన రాజకీయాలు చేయడం తండ్రీకొడుకులకు పరిపాటిగా మారిందని అన్నారు. దక్షిణాదిని కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

రక్షణశాఖ భూములు కొట్టేయాలన్న టీఆర్ఎస్ ప్లాన్ విఫలమైందని లక్ష్మణ్ పేర్కొన్నారు. భూములు ఇవ్వడం కుదరదన్నందుకే కేంద్రంపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంతో ఎదిగిన టీఆర్ఎస్ నేడు తెలంగాణ అస్థిత్వానికే ముప్పులా మారిందని విమర్శించారు.

 

Related posts