telugu navyamedia
ఆంధ్ర వార్తలు

త‌ల్లి విజ‌య‌మ్మ‌తో క‌లిసి ప్లీన‌రీ ప్రాంగ‌ణానికి చేరుకున్న సీఎం జ‌గ‌న్‌..

*ప్లీన‌రీ ప్రాంగ‌ణానికి చేరుకున్న సీఎం జ‌గ‌న్‌
*త‌ల్లి విజ‌య‌మ్మ‌తో క‌లిసి వ‌చ్చిన సీఎం జ‌గ‌న్‌
*వైసీపీ జెండాను ఆవిష్క‌రించిన సీఎం జ‌గ‌న్‌..

మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తోన్న ప్లీనరీ నిర్వ‌హిస్తున్నారు.

వైసీపీ పీన్లరీ ప్రాంగణానికి వైఎస్‌ విజయమ్మ, సీఎం వైఎస్‌ జగన్‌ చేరుకున్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి.. పీన్లరీని వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. అనంత‌రం పీన్లరీ వేదిక‌పై దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూల‌మాల వేసి నివాళులుఅ ర్పించారు.

నాయకులు, కార్యకర్తలు వెయ్యికార్లతో భారీ ర్యాలీగా తరలివచ్చారు . పార్టీ కార్యకర్తలు, ప్రతినిధులతో ప్లీనరీ ప్రాంగణం నిండిపోయింది.

 

Related posts