ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో సచివాలయ అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు బ్లాకులను సీజ్ చేశారు. ఆ రెండు బ్లాకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సచివాలయం మొత్తం రసాయన ద్రావణాలతో శానిటైజ్ చేస్తున్నారు. 3, 4 బ్లాకుల్లోకి ప్రవేశం నిషేధించారు.
లాక్డౌన్తో హైదరాబాద్లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులను గత నెల 27న ప్రత్యేక బస్సుల్లో అమరావతికి తీసుకువచ్చారు. అయితే వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఓ ఉద్యోగికి పాజిటివ్ వచ్చింది. దీంతో అతనితోపాటు హైదరాబాద్ నుంచి వచ్చిన వారిని స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచించారు.