స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం కేసులో రమేష్ ఆస్పత్రి చైర్మన్ రమేష్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రమేష్ ఆసుపత్రి మేనేజ్మెంట్లో సభ్యురాలిగా ఉన్న డాక్టర్ మమతకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల అందుకున్న డాక్టర్ మమత.. విచారణ కోసం సౌత్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు.
డాక్టర్ మమత నుండి ఏసీపీ సూర్యచంద్రరావు వివరాలను సేకరిస్తున్నారు. ఉదయం 11 గంటల నుండి విచారిస్తున్నారు. విచారణలో భాగంగా కోవిడ్ పేషెంట్లను ఎలా అడ్మిట్ చేసుకుంటున్నారే కోణంలోనూ డాక్టర్ మమతను విచారించారు. రమేష్ పరారీలో ఉండటం వల్లే ఆస్పత్రి మేనేజ్మెంట్ డాక్టర్లను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.