telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా కేసులపై ప్రభుత్వం కాకి లెక్కలు: కళావెంకట్రావు ఫైర్

kalavenkat rao tdp

కరోనా కేసుల విషయంలో ఏపీలోని జగన్ సర్కార్ కాకి లెక్కలు చెబుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కళావెంకట్రావు ధ్వజమెత్తారు. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. రాజకీయ లబ్ధికోసం వ్యవస్థలను ధ్వంసం చేయడం సరికాదన్నారు. కోవిడ్-19 కేసుల విషయంలో నిజాలను తొక్కి పెడుతోందని ధ్వజమెత్తారు. ప్రజల ప్రాణాలకంటే రాజకీయాలే ముఖ్యమా? అని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వం తీరువల్ల వైద్యులు ఆసుపత్రులకు రావడానికి భయపడుతున్నారన్నారు. సరైన రక్షణ పరికరాలు ఇవ్వకున్నా, కనీస సౌకర్యాలు లేకున్నా వైద్యులు వృత్తి ధర్మాన్ని పాటించి వైద్యం చేస్తున్నారు తప్ప ప్రభుత్వం మాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు ఎలావున్నాయో కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts