రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఆలస్యంపై వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల మరోసారి సీరియస్ అయ్యారు. సర్కారు తీరుకు ఆగ్రహించి కొందరు రైతన్నలు తమ పంటలు తగులబెట్టుకుంటున్నారని.. మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల అన్నారు.
వడ్లు కొనకుండా రైతు మీద సర్కారు పగపడుతున్నారని, తరుగు పేరిట రైతు మిల్లర్లు దోచుకుంటున్నారని, దాన్యం కొంటారో కొనరో తెలియక రైతు గుండెలు ఆగిపోతున్నాయని షర్మిల ఫైర్ అయ్యారు. ఎవడు చస్తే తమకేందని ప్రభుత్వం చేతులెత్తేసిందని, కేసీఆర్ ధాన్యం కొనకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
పంటను కొనమని రైతులు కాళ్ళు పట్టుకుంటున్నా, పంటను కొనకుండా రైతులతో పంటను తగలబెట్టేలా చేసినా, నువ్వు వడ్లు కొనకపోతే నీ కాలర్ పట్టుడు పక్కా…నీ అధికారానికి నిప్పు పెట్టుడు పక్కా అంటూ ఆమె ట్వీట్ చేశారు.