దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచారం కేసుపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్నగర్లో ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాతంలో దిశా అనే వెటర్నరీ డాక్టర్పై నలుగురు దుండగులు అత్యాచారం చేసి, అనంతరం సజీవదహనం చేశారు. ఈ ఘోర ఘటనపై యావత్ భారత దేశం స్పందించింది. అఘాయిత్యానికి పాల్పడిన నిందితలకు వెంటనే ఉరిశిక్ష వేయాలనీ పలువురు తమ ఆక్రోశం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అమిత్ షా టీడీపీకి తలుపులు మూసేశారు: కన్నా