టీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి హితవు పలికారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లో కాంగ్రెస్ మద్దతుదారుల తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఓట్ల కోసం అధికార పార్టీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
బెదిరింపు రాజకీయాలకు భయపడబోమని స్పష్టం చేశారు. రేషన్కార్డులు, పింఛన్లు తొలగిస్తామని అధికార పార్టీ నాయకులు బెదిరించడం శోచనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కు ఉంటుందని, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.