ఎన్నికల నోటిఫికేషన త్వరలో వెలువడనున్న తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపిక పై దృష్టి సారించారు. జిల్లాలవారిగా సమీక్షలు నిర్వహించి బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని భావిస్తున్నారు. కీలక అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా జగన్ దృష్టి సారించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, హీరో బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంపై గురి పెట్టారు.బీసీలతో పాటు మైనార్టీలకు గట్టి పట్టున్న ఈ ప్రాంతంలో టీడీపీని ఎదుర్కోనేందుకు రిటైర్ట్ పోలీస్ అధికారి ఇక్బాల్ అహ్మద్ను రంగంలోకి దించాలని జగన్ భావిస్తున్నట్లు హిందూపురంలో వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో మైనార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీని బాలయ్యపై ప్రయోగించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. అయితే ఘనీ ఆరోగ్యం సహకరించక కపోవడంతో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఎన్నికలకు ముందు క్యాడర్లో స్తబ్ధత నెలకొన్న పరిస్ధితుల్లొ మరో నేత అవసరాన్ని జగన్ గుర్తించారు. దీనిలో భాగంగానే ఇక్బాల్ అహ్మద్ పేరు తెర మీదకు వచ్చింది. మరోవైపు హిందూపురంతో పాటు చిలమత్తూరు మండలాల్లో సైతం బలమైన మైనార్టీ కోసం వైసీపీ అడదిష్టానం అన్వేషన మొదలు పెట్టినట్టు స్పష్టమవుతోంది.