ఎన్నికల నోటిఫికేషన త్వరలో వెలువడనున్న తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపిక పై దృష్టి సారించారు. జిల్లాలవారిగా సమీక్షలు నిర్వహించి బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని భావిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అభ్యర్థుల జాబితా సిద్దమైంది. మార్చి మూడో వారంలో అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని ఆపార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందుకు తగట్టుగా కసరత్తు చేపట్టింది. ముఖ్యంగా బలమైన నేతల రాక కోసం ఓవైపు ప్రయత్నాలు చేస్తూనే మరో వైపు అభ్యర్థుల ఎంపిక పనిలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
తూర్పుగోదావరి వైసీపీ అభ్యర్థుల జాబితా:
తుని- దాడిశెట్టి రాజా (సిట్టింగ్)
పత్తిపాడు – పరావత్ పూర్ణ చంద్ర ప్రసాద్
జగ్గంపేట- తోట వాణి
రంపచోడవరం – నాగులపల్లి ధనలక్ష్మి
రాజానగరం- జక్కంపూడి రాజా
రాజమండ్రి రూరల్- ఆకుల వీర్రాజు
రాజమండ్రి సిటీ- రౌతు సూర్యప్రకాశ్ రావ్
అనపర్తి- కర్రి సూర్యనారాయణ రెడ్డి
పెద్దాపురం- దవులూరి దొరబాబు
పిఠాపురం- ముద్రగడ పద్మనాభం లేదా పెండెం దొరబాబు
కాకినాడ రూరల్- కురసాల కానన్ బాబు
కాకినాడ సిటీ -ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
రామచంద్రపురం – చెల్లుబోయిన వేణు
మండపేట- పితాని అనన్ వరన్
కొత్తపేట - చిర్ల జగ్గిరెడ్డి( సిట్టింగ్)
ముమ్మిడివరం – పొన్నాడ సతీష్
అమలాపురం- పినిపే విశ్వరూప్
రాజోలు- బొంతు రాజేశ్వర్ రావు
East Godavari YCP List Ready
ఫలితాల రోజే కూటమి సమావేశం: చంద్రబాబు