telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

భారత్ తాజా సెర్జికల్ స్ట్రైక్ .. గురితప్పిందా ! బీజేపీ ప్రచారం మాత్రమే చేసుకుంటుందా !!

Balakot, Pak Attack

ఇటీవల బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానక దళం జరిపిన దాడులపై వివాదం రోజురోజుకూ ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి తెరలేపింది ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కావడం విశేషం. ఆ దాడిలో ఉగ్రమూకలు ఎంత మంది మృతి చెంది ఉండవచ్చు అనేదానిపై ఆ ప్రభుత్వంలో నేతలు తలా ఒక సంఖ్య చూపుతుండటంతో .. అసలు దాడి నిజంగా జరిగిందా లేక గురితప్పిందా అన్న అనుమానాలకు తావిస్తుంది. తాజాగా కూడా ప్రభుత్వం లెక్కతేలాల్సి ఉందని సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక విపక్షం, వైమానిక దాడి రాజకీయ లక్ష్యాల కోసం జరిగిందని ఆరోపిస్తుంటే; రక్షణ బలగాల ఆత్మైస్థెర్యాన్ని విపక్షాలు దెబ్బతీస్తున్నాయని పాలక పక్షం ఎదురుదాడికి దిగుతున్నది. ఇక దాడిలో చెట్లు నాశనం అయ్యయి తప్ప ఎవరు మృతి చెందలేదని పాక్ స్పష్టం చేయడం కూడా విపక్షాల వాదనకు బలాన్ని చేకూరుస్తుంది.

పుల్వామా ఉగ్రదాడిలో షామిలికి చెందిన ప్రదీప్‌కుమార్, మైన్‌పురికి చెందిన రాంవకీల్ అమరులయ్యారు. ఆ దాడికి ప్రతీకారంగా బారతదేశం సుమారు 50 సంవత్సరాలలో మొదటిసారిగా ఉగ్రవాద శిబిరాలపై దాడికోసమని పాక్ భూభాగంపైకి యుద్ధవిమానాలను పంపింది. వేలటన్నుల పేలుడు పదార్తాలను గుమ్మరించినట్టు వార్తలు వెలువడ్డాయి. శిక్షణ పొందుతున్న ఉగ్రవాదులు పెద్దసంఖ్యలో మరణించినట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. కాన అంతర్జాతీయ మీడియాలో ఇందుకు విరుద్ధమైన కథనాలు వస్తున్నాయి. ఈ గందరగోళం మధ్య ఆ ఇద్దరు జవాన్ల కుటుంబాలు ఉగ్రవాదులు మరణించినట్టు ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తున్నాయి. సాక్ష్యం చూపేంతవరకు ఎలా నమ్మగలం? పాకిస్థాన్ అసలు ఎలాంటి నష్టం జరుగలేదని అంటున్నది అంటూ వారు వాదిస్తున్నారు.

పుల్వామాలో జరిగిన దాడి సమయంలో కనిపించిన విరిగిన కాళ్లూచేతులు, మొండాల ఫొటోలు రావాలి కదా? సరైన ఆధారాలు లేకుండా ఉగ్రవాదులు చనిపోయినట్టు నమ్మడానికి మేం సిద్ధంగా లేం. రుజువు చూపితేనే మా అమరవీరుల బలిదానానికి ప్రతీకారం తీర్చుకున్నట్టు మేం నమ్ముతాం.. అని రాంవకీల్ సోదరి రాంరక్ష తేల్చిచెప్పింది. అటు షామిలిలో ప్రదీప్‌కుమార్ తల్లి కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. టీవీలో ఉగ్రవాదుల మృతదేహాలు చూపితేనే కదా నమ్మగలిగేది అని ఆమె నిలదీస్తున్నారు. ఈ వివాదం ప్రభుత్వానికి ఇరకాటంగా తయారైంది. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఓ సభలో మాట్లాడుతూ 300 మొబైల్ పోన్లు ఆ ప్రాంతంలో యాక్టివ్‌గా ఉన్నట్టు జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థ ఎన్టీఆర్వో తెలిపిందని వెల్లడించారు. మరి 300 సెల్‌ఫోన్లు మనుషులు కాక చెట్లు ఉపయోగిస్తాయా? అని ఆయన ప్రశ్నించారు. కానీ మృతుల వివరాలపై కచ్చితమైన లెక్కలను ఇప్పటికీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు.

పాక్ ప్రభుత్వం మాత్రం, భారత యుద్ధ విమానాలు తమ భూభాగంలోకి రాగానే వాటిని పసిగట్టలేకపోయినా, వీలైనంత త్వరగానే వాటి జాడను కనుక్కున్నామని, వాటిని తరిమి కొట్టే తరుణంలో బాంబులు ఇష్టానుసారంగా పాక్ భూభాగంపై భారత యుద్ధ విమానాలు జారవిడిచి వెళ్లాయని అంటున్నది. అందుకే విరిగిన చెట్లు, గుంతలు తప్ప అక్కడ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని. అసలు జైషే ఉగ్ర స్థావరం మూడు మైళ్ళ దూరం నుండే భారత యుద్ధవిమానాలను తరిమికొట్టినట్టు పాక్ చెప్పుకొస్తుంది. ఇందులో ఏది నిజం.. అనే ప్రతిష్టంభన అందరిలో నెలకొంది. ఇక ఈ దాడిపై బీజేపీ కూడా రాజకీయంగా తీవ్రంగా ప్రచారం చేసుకోవడం తో .. ఇది రాజకీయ దాడిగా కూడా అనుమానించాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related posts