ఏపీలో ఓ వింత పెళ్లి జరిగింది. ఇద్దరు మైనర్లు ఏకంగా క్లాస్ రూంలోనే పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లిని కాస్త బొమ్మలాట చేశారు ఆ మైనర్లు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ కాలేజీలో ఈ పెళ్లి ఇప్పుడు కలకలం రేపుతోంది. క్లాస్ రూమ్లో ఇద్దరు మైనర్లు పెళ్లి చేసేసుకున్న… ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్… ఇద్దరు విద్యార్థులకు టీసీ ఇచ్చి పంపించాడు. అటు వీరు చేసిన పనికి ఏం చేయాలో తెలియని స్థితిలోకి వారి తల్లిదండ్రులు వెళ్లిపోయారు. విద్యార్థులు చేసిన పనితో వారి తల్లిదండ్రులు తలపట్టుకుంటున్నారు. చదువుకోవాల్సిన వయస్సులో ఈ పిచ్చి పనులేంటంటూ ఆవేదన చెందుతున్నారు. ఎంతో పవిత్రంగా భావించే పెళ్లిని ఎగతాలి చేస్తూ ఇలా బొమ్మల పెళ్లిళ్లు చేసుకోవడమేంటంటూ మండిపడుతున్నారు. అయితే.. పెళ్లి చేసుకున్న మైనర్లు ఇద్దరూ… ఇంటర్ చదువుతున్నారు. అందులోనూ ఒకే తరగతి కావడంతో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహరం నడిచింది.