ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి కె.రామచంద్రమూర్తి రాజీనామా చేశారు. కె.రామచంద్రమూర్తి తన రాజీనామాను ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లంకు సమర్పించారు. తన రాజీనామాకు వ్యక్తిగత అంశాలే కారణమని ఈ సందర్భంగా రామచంద్రమూర్తి పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కె.రామచంద్రమూర్తి సీనియర్ పాత్రికేయులు. అనేక దినపత్రికలకు ఎడిటర్ గా వ్యవహరించారు. ఎలక్ట్రానిక్ మీడియాలోనూ పనిచేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద సంఖ్యలో ప్రభుత్వ సలహాదారులను నియమించింది. వారిలో కె.రామచంద్రమూర్తి కూడా అవకాశం లభించింది.