ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భద్రతపై డీజీపీ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. చంద్రబాబు భద్రత విషయంలో ఎటువంటి మార్పులు చేయలేదని పేర్కొంది. ఆయనకు దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని తెలిపింది. చంద్రబాబు భద్రతను తగ్గించినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో డీజీపీ కార్యాలయం ఈ ప్రకటన చేసింది.
సెక్యూరిటీ రివ్యూలో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు చేశామని, ప్రస్తుతం చంద్రబాబుకు జెడ్ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నట్టు వివరించింది. ఆయనకు మొత్తం 183 మందితో భద్రత కల్పిస్తున్నామని, ఇందులో 135 మందితో విజయవాడలో, 48 మందితో హైదరాబాద్లో భద్రత కల్పిస్తున్నట్టు డీజీపీ కార్యాలయం వెల్లడించింది.