అస్సాంలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి చేదు అనుభవం ఎదురైంది. గౌహతిలో మోదీ వెళ్తున్న మార్గంలో కొందరు ఆందోళనకారులు నల్ల జెండాలను ప్రదర్శించారు. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఇవాళ రెండవ రోజు కూడా నల్ల జెండాలతో నిరసన తెలిపారు.
శుక్రవారం కూడా కొందరు ఆందోళనకారులు మోదీ వచ్చినప్పుడు నల్ల జెండాలు ప్రదర్శించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గౌహతిలోని రాజ్భవన్కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అస్సాం స్టూడెంట్స్ యూనియన్కు చెందిన విద్యార్థులు ఆ జెండాలను ప్రదర్శించారు.
సాక్షి పత్రికలో బడ్జెట్ పై భజన వార్తలు: నారా లోకేశ్