telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రతిపక్షాలు ప్రజల్లో అలజడి సృష్టించొద్దు: కన్నబాబు

minister kannababu

కరోనాపై ప్రతిపక్షాలు ప్రజల్లో అలజడి సృష్టించ వద్దని ఏపీ మంత్రి కన్నబాబు సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు హడావుడి ఏంటో అర్థం కావట్లేదని, కరోనాపై ఆయన రివ్యూలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండదని తెలిపారు. కోర్టు తీర్పులను తాము గౌరవిస్తామని కన్నబాబు చెప్పారు.

కరోనా పేరుతో రైతుల్ని వ్యాపారులు భయాందోలనకు గురిచేస్తున్నారు. కరోనా సాకుతో ఉత్పత్తుల ధరల్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా వల్ల పౌల్ట్రీ దెబ్బతింది, మొక్కజొన్న ధరలు పడిపోతున్నాయి. మొక్కజొన్నను ఏప్రిల్‌ 1 నుంచి కొనుగోలు చేస్తాం. రైతుకు ప్రకటించిన ఎమ్మార్పీకే కొనుగోలు చేస్తాం. కరోనా వల్ల మార్కెట్లు మూసేస్తున్నారనేది అవాస్తవమని మంత్రి స్పష్టం చేశారు.

Related posts