కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్ తగిలింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్(ఓఐసీ) సమావేశంలో కశ్మీర్ అంశం గురించి చర్చించాలని ఇమ్రాన్ చేసిన అభ్యర్థనను సౌదీ అరేబియా తోసిపుచ్చింది. ఇస్లామిక్ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు సాధారణంగా ఆ సమావేశంలో పాల్గొంటారు.
కశ్మీర్ అంశంలో ఓఐసీ మీటింగ్లో ఒక్కటి కాలేకపోతున్నామని పాక్ ప్రధాని ఇమ్రాన్ అన్నారు. ఓఐసీలో కశ్మీర్పై చర్చిస్తామని గత డిసెంబర్లో ఇమ్రాన్ అన్నారు, కానీ దానిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదని భారత్ పేర్కొన్నది. అయితే తాజాగా పాక్కు చెందిన ఓ పత్రిక క్లారిటీ ఇచ్చింది. ఇమ్రాన్ అభ్యర్థనను సౌదీ తిరస్కరించినట్లు తన కథనంలో రాసింది.