telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గా.. వాసిరెడ్డి పద్మ ప్రమాణ స్వీకారం

vasireddy padma ycp

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మను ఏపీ సర్కార్ నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వాసిరెడ్డి పద్మ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పద్మతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, నారాయణ స్వామి, మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, జయరాములు, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథ్‌ రాజు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, ఎంపీలు వంగా గీత, చింత అనురాధ తదితరులు హాజరయ్యారు. బాధ్యతలు స్వీకరించిన వాసిరెడ్డి పద్మకు అభినందనలు తెలిపారు.

Related posts