telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రేటర్‌ ఎన్నికలు : నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు

chandrababu tdp

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపైనే అన్ని పార్టీలు ఇప్పుడు దృష్టి సారించాయి. ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు రంగంలోకి దిగి ఓటర్లను మమేకం చేసుకుంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే నెలలో వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితా కూడా విడుదలైంది. దీంతో టీడీపీ కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలందరూ సిద్ధం కావాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు శ్రేణులకు సూచించారు. ఈ మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పార్టీ నాయకులతో జూమ్‌ మీటింగ్‌లో మాట్లాడారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, గ్రేటర్‌ కన్వీనర్‌ అరవింద్‌కుమార్‌ గౌడ్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నల్లెల కిషోర్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..టీడీపీ హయాంలో జరిగిన సైబరాబాద్‌ నిర్మాణం, తదితర అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. డివిజన్‌, బూత్‌ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. త్వరలో నియోజకవర్గ ఇన్‌చార్జిల నియామకం జరుగుతుందని పేర్కొన్నారు. టీడీపీకి పూర్వవైభవం తీసుకువచ్చేలా అందరూ పని చేయాలని కోరారు.

Related posts