విశాఖలో మైనర్ బాలికలపై అత్యాచారం కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. పోక్సోచట్టం కింద వారి పై కేసు నమోదు చేసారు పోలీసులు. ఈ కేసు పై క్రైమ్ డిసిపి సురేష్ బాబు మాట్లాడుతూ… ఈనెల 10 ఇంటినుంచి వెళ్లిన ఇద్దరు మైనర్ బాలికలలో ఒకరి పై అత్యాచారం… మరొకరిపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ మణీంద్ర, స్వామి అనే ఇద్దరు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించాము అని చెప్పారు. బీచ్ కు అని చెప్పి రాజీవ్ నగర్ కు తీసుకు వెళ్లి పాడుపడిన ఇంటిలో ఒక బాలికపై బలాత్కారం చేశారు నిందితులు. మరో బాలికపై అత్యాచారానికి యత్నించారు అని చెప్పారు. 12 న బాలిక తల్లి ఒకరు దువ్వాడ పిఎస్ లో ఫిర్యాదు చేయడంతో కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కూర్మానపాలెం లో నిందితులను ఇరువుర్నీ అరెస్ట్ చేశాము. ఆ నిందితులు తాపీమేస్త్రీలు అని పేర్కొన్నారు.
previous post
జగన్ అందుకే అనుచితంగా ప్రవర్తిస్తున్నారు: ఎమ్మెల్సీ బుద్ధా