telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

దేశంలో కరోనా మహోగ్రరూపం.. ఒక్కరోజులో 648 మంది మృతి

Corona

దేశంలో కరోనా మహోగ్రరూపం డాలచడంతో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం… గత 24 గంటల్లో భారత్‌లో 37,724 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 648 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 11,92,915కి చేరింది. మృతుల సంఖ్య 28,732కి పెరిగింది. 4,11,133 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 7,53,050 మంది కోలుకున్నారు.నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,47,24,546 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,43,243 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది.

Related posts