టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. “అసమర్దుడయిన పుత్రరత్నం కోసం ఏ ఉన్మాద ధ్వంసరచనకైనా సిద్ధమేనని 40 ఇయర్స్ ఇండస్ట్రీ నిస్సిగ్గుగా తేల్చి చెప్పాడు. 14 ఏళ్లు సిఎంగా ఉన్న వ్యక్తి ముసుగు తొలగించి ఇకపై తాను కొందరికే ప్రాతినిధ్యం వహిస్తానని ప్రకటించాడు. మొదట నీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చి సూటిగా చెప్పేసేయ్ బాబూ. ముందుకు సాగడం ప్రకృతి నియమం. మధ్య యుగాల నాటి ఉన్మాద మనస్థత్వంతో చంద్రబాబు రాకెట్ వేగంతో తిరోగమనంలోకి దూసుకెళ్తున్నాడు. ప్రపంచం పురోగమనం వైపు పరుగులు పెడుతుంటే అందుకోలేనంత వెనక పడిపోయాడని, ఒంటరిగా మిగిలిపోయాడని తొందర్లోనే తెలుస్తుంది. ” అంటూ మండిపడ్డారు. ఇక అంతుకు ముందు ట్వీట్లో విగ్రహం ధ్వంసం వ్యవహరాలపై విజయ సాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “ప్రభుత్వ పథకాల్లో ఏవైనా లోపాలు దొర్లితే ఎత్తి చూపాల్సిన ప్రతిపక్షం, అటువంటివేవీ కనిపించకపోవడంతో గుళ్లు, విగ్రహాల ధ్వంసానికి తెగబడుతోంది.కొట్లాటలు పెట్టడం మాని,మంచి పనులకు సూచనలిస్తే సిఎం జగన్ గారు తప్పకుండా స్వీకరిస్తారు.కుట్రలకు పాల్పడితే తప్పించుకోలేరు.చట్టం వదిలి పెట్టదు.” అంటూ ఆయన కోరారు.
previous post