telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఐటీ కంపెనీలో కరోనా కలవరం..బెంబేలెత్తిపోతున్న ఉద్యోగులు

software employees

హైదరాబాద్ హైటెక్ సిటీలో కరోనా కలవరం రేపింది. దీంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. హైటెక్ సిటీ ప్రాంతంలోని రహేజా మైండ్ స్పేస్ లో కరోనా కలకలం రేపుతోంది. ఇందులోని బిల్డింగ్ నంబర్ 20లో ఉన్న ఐటీ కంపెనీ (డీఎస్ఎం సంస్థ)లో పని చేస్తున్న ఒక ఉద్యోగినికి కరోనా సోకినట్లు తెలిసింది. 

ఈ నేపథ్యంలో అక్కడ పని చేస్తున్న ఉద్యోగులంతా బెంబేలెత్తిపోతున్నారు. కరోనా అలజడి నేపథ్యంలో అక్కడి కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప ఉద్యోగులు ప్రయాణాలు చేయకూడదని సూచించాయి. పలు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలను జారీ చేస్తున్నాయి.

Related posts