పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ గడువును ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. గతంలో సెప్టెంబర్ 30లోగా ఈ ప్రక్రియను ముగించాలని నిర్ధేశించగా తాజాగా ఆ గడువును పొడిగించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా పాన్ కార్డును ఇంకా ఆధార్తో లింక్ చేసుకోని వారికి ప్రభుత్వ నిర్ణయం ఊరట ఇస్తోంది.
నిర్ధేశిత డెడ్లైన్లోగా పాన్తో ఆధార్ లింక్ కాకుంటే పాన్ కార్డు పనిచేయదు. ఈ క్రమంలో పాన్ను తప్పనిసరిగా పేర్కొనాల్సిన ఆర్థిక లావాదేవీలను కొనసాగించడంలో తమ పాన్తో ఆధార్ను లింక్ చేయని వ్యక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్తగా విధించిన గడువు ప్రకారం వినియోగదారులు తమ పాన్ కార్డులను డిసెంబరు 31 లోపు ఆధార్ తో అనుసంధానించుకోవాలి.