telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈ నెల 24న జగన్, కేసీఆర్ మరోసారి భేటీ!

cm jagan and KCr

హైదరాబాద్ ప్రగతి ప్రగతిభవన్ లో ఈ నెల 24న ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మావేశం కావాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని  సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఈ భేటీలో గోదావరి నది నీటిని కృష్ణా బేసిన్ కు తరలించే విషయమై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు

ఈ విషయమై ఇప్పటికే జగన్, కేసీఆర్ ఓ అంగీకారానికి వచ్చారు. ఈ విషయంలో అధ్యయనం చేసేందుకు ఇరురాష్ట్రాల్లో ఇంజనీర్లతో అధ్యయన కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ నివేదికలు అందినప్పటికీ ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యేందుకు కుదరలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 24న సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ భేటీలో ఇరురాష్ట్రాల ఇంజనీరింగ్ అధికారులు కూడా పాల్గొననున్నారు.

Related posts