telugu navyamedia
రాజకీయ

త‌ప్పు చేయకుంటే భయమెందుకు.. సంజయ్‌ రౌత్‌ ఇంట్లో ఈడీ దాడులపై షిండే కామెంట్స్‌

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ నివాసంలోఈడీ దాడులు నిర్వహించడంపై సీఎం ఏక్‌నాథ్‌ షిండే స్పందించారు. తాను ఏ త‌ప్పు చేయకుంటే శివసేన నేత ఎందుకు భయపడుతున్నాడో చెప్పాల‌ని సీఎం షిండే అన్నారు.

తానేమీ తప్పు చేయలేదని రౌత్ చెప్పాడు, కాబట్టి అతను భయపడాల్సిన అవసరం లేదనీ, ఈడీ చర్యలకు ఎవరైనా భయపడితే వాళ్ళు బీజేపీలో త‌మ వ‌ర్గంలో చేరవద్దని ఆయన అన్నారు.

రాజకీయ ప్రేరేపణ ఆరోపణలను తోసిపుచ్చిన ఏక్‌నాథ్ షిండే.. గ‌తంలో కూడా ఈడీ దాడులు జరిపిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఈడీ పని చేస్తుందని ఆరోపిస్తే.. సుప్రీంకోర్టు దానిపై చర్య తీసుకుంటుంద‌నీ, ఈ కేసులో ఈడీ తన పని తాను సరిగ్గా చేస్తోందని అన్నారు.

కాగా పట్రా చాల్ భూ కుంభకోణం కేసులో ఆదివారం ఉదయం ముంబైలోని సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ దాడులు చేసింది. రౌత్‌ను ముంబై ‘చాల్’ రీ-డెవలప్‌మెంట్‌కు సంబంధించిన అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో రౌత్‌కు విచారణ సంస్థ జూలై 20న సమన్లు ​​కూడా జారీ చేసింది.

అయితే ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున, ఆగస్టు 7 తర్వాత మాత్రమే హాజర‌వుతాన‌ని తన లాయర్ల ద్వారా తెలియజేసారు. జూలై 1న ఆయన తన స్టేట్‌మెంట్‌ను ఒకసారి నమోదు చేశారు.

Related posts