రాష్ట్రానికి మంచి జరగడం కోసం ఏ త్యాగానికైనా తాము సిద్ధమని వైసీపీ నేత మోపిదేవి వెంకటరమణ అన్నారు. శాసనమండలి నుంచి మంత్రి పదవి దక్కించుకున్న మోపిదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మండలి రద్దయితే తన మంత్రి పదవి పోతుందన్న నేపథ్యంలో ఆయన స్పందించారు.
పార్టీ నుంచి తనకు భరోసాలు ఏమీ లేవని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేందుకే జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు తామే పదవులు త్యాగం చేస్తామని మోపిదేవి ఉద్ఘాటించారు. మండలిపై నిబంధనలకు లోబడే నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.