telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చైనాలో కరోనా వైరస్.. చంద్రబాబు లేఖ

chandrababu

చైనాలో కరోనా వైరస్ వ్యాపించడంతో అక్కడ చిక్కుకుపోయిన 58 మంది తెలుగు ఇంజినీర్ల పరిస్థితిపై తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. కరోనా వైరస్ వ్యాప్తిలో ఉన్న చైనాలోని వుహాన్ నగరంలో తెలుగు ఇంజినీర్లు చిక్కుకుపోయారని, వారిని వీలైనంత త్వరగా స్వదేశం తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కు లేఖ రాశారు.

“ఇటీవలే మీరు 20 మంది తెలుగు మత్స్యకారులను పాకిస్థాన్ నుంచి సురక్షితంగా తీసుకువచ్చారు. తెలుగు ప్రజలు మీ సేవలను సదా గుర్తుంచుకుంటారు. ఇప్పుడు కూడా 58 మంది ట్రైనీ ఇంజినీర్లను సురక్షితంగా తీసుకురావాలని వారి కుటుంబాల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ తన లేఖలో పేర్కొన్నారు.

Related posts