రెండో విడతలో 81.67 శాతం పోలింగ్ నమోదైందని..పీఆర్ కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో పోలింగ్ అయిందని…పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. శ్రీకాకుళంలో అత్యల్పంగా పోలింగ్ జరిగిందన్నారు. రీ-పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితులు ఎక్కడా లేవని ఆయన వెల్లడించారు. జిల్లాల వారీగా పోలింగ్ శాతాన్ని కూడా ఆయన ప్రకటించారు.
జిల్లాల వారీ పోలింగ్..
శ్రీకాకుళం 72.87
విశాఖ 84.94
విజయనగరం 82
ఈస్ట్ గోదావరి 82.86
వెస్ట్ గోదావరి. 81.75
కృష్ణా 84.12
గుంటూరు 85.51
ప్రకాశం 86.93
నెల్లూరు 78.04
చిత్తూరు 77.20.
కడప 80.47
కర్నూలు 80.76
అనంతపురం 84.65.
ప.గో 81.75