telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి… మహేష్ బాబు ట్వీట్

even I donot get ticket in AMB said mahesh

ప్రధాన మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూకు విశేష స్పందన లభిస్తోంది. మోదీ సూచనలను ప్రతి ఒక్కరు పాటించాలని పలువురు సెలబ్రిటీలో కోరుతున్నారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రేపు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ట్విట్టర్ ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు మహేష్ బాబు. మనల్ని రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన ధైర్యశీలులకు శాల్యూట్ చేద్దామన్నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు బాల్కనీల్లో నిల్చుని మనం కొట్టే చప్పట్లు ప్రతిధ్వనించాలి.. అదే మనం వారికిచ్చే గౌరవం, చప్పట్ల శబ్ధంలో అవి కనిపించాలి ’ అంటూ మహేష్ తన పోస్టులో పేర్కొన్నాడు. ప్రధాని పిలుపును అందరూ పాటించాలని, కరోనాను తరమికొట్టేందుకు ప్రతి ఒక్కరు జనతా కర్ఫ్యూలో భాగస్వాములు కావాలని మహేశ్‌బాబు మరో ట్వీట్ ద్వారా తన ఫ్యాన్స్‌కు, ప్రజలకు పిలుపునిచ్చాడు.

Related posts