అధికారం ఉన్న వైసీపీ నేతల ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. తిరుపతిలోని సురుటుపల్లి పల్లి కొండేశ్వర ఆలయ ఈవో మురళి కృష్ణకు వై.సి.పి నేత ఆలయ మాజీ చైర్మన్ మునిశేఖర్ రెడ్డి నుంచి బెదిరింపులు వస్తున్నాయి. గత పది రోజులుగా ఆలయ మాజీ చైర్మన్ మునిశేఖర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడు తున్నారని స్వయంగా ఈఓ మురళి కృష్ణ పేర్కొన్నారు. గత సంవత్సరం శారద నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఉబయ దారుడు మధు రెడ్డి ని తొలగించి తన బావని ఉబయధారుడిగా నియమించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ఆలయానికి వచ్చి విచారణ చేపట్టారు. ఈ విచారణ లో ఉబయధారుడిని మార్చే హక్కు ఎవరికి లేదని స్పష్టం చేశారు. అయినా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉబయదారుడిని మార్చాలని మళ్లీ మునిశేఖర్ రెడ్డి ఒత్తిడి చేస్తున్నారని.. ఇందుకు ఒప్పుకోక పోవడంతో గత 10 రోజులుగా తన అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈవో మురళి కృష్ణ తెలిపాడు.
previous post
next post