telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ఐటీబీపీ జవాన్లకు మహేష్‌ సెల్యూట్‌…

Mahesh

ఉత్తరాఖండ్‌ మెరుపు వరదల్లో గల్లైంతన 16 మందిని రక్షించారు సహాయక సిబ్బంది. ఎన్టీపీసీ తపోవనమ్‌ దగ్గర టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను సేఫ్‌గా బయటకు తీశారు. మొత్తం 16 మందిని రక్షించినట్లు అధికారులు చెబుతున్నారు. ఛమోలీ జిల్లాలోని తపోవన్ ఏరియాలో ధౌలీగంగ నదిలో కొండచరియలు విరిగిపడటంతో.. వరద ప్రవాహం అనూహ్యంగా పెరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఘటనపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి పలువురిని కాపాడిన ఐటీబీపీ జవాన్లకు మహేష్‌ సెల్యూట్‌ చేశారు. వరదల్లో గల్లంతైన వారు క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు’ మహేష్‌ బాబు ట్వీట్‌ చేశారు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో శరవేగంగా జరుగుతుంది. చూడాలి మరి ఈ సినిమా చెప్పిన విధంగా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుందా.. లేదా అనేది.

Related posts