telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టికెట్ దక్కని అభ్యర్థుల్లో ఆగ్రహం..వైసీపీ ఆఫీస్ ధ్వంసం

YCP padma comments Chandrababu

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జాబితాలో పేర్లు లేని అభ్యర్థుల్లో ఆగ్రహం వెల్లువిరిసింది. దీంతో విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీలో అసమ్మతి భగ్గుమంది. సమన్వయకర్త వంశీకృష్ణకు టికెట్ కేటాయించకపోవడంతో కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ సత్యనారాయణ ఆఫీసును కార్యకర్తలు ధ్వంసం చేశారు. పార్టీ కార్యాలయం ఎదుట మహిళా కార్యకర్త నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది.

విశాఖ పట్టణంలోని విశాఖ తూర్పు స్థానం నుండి డాక్టర్ విజయనిర్మలకు వైసీపీ టిక్కెట్టు కేటాయించింది. ఈ స్థానం నుండి వైసీపీ నేత వంశీకృష్ణ టిక్కెట్టు ఆశించారు. ఈ స్థానంలో వంశీకృష్ణకు టిక్కెట్టు కేటాయించలేదు. దీంతో వంశీకృష్ణ వర్గీయులు విశాఖ ఎంపీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంపై ఆదివారం నాడు దాడికి దిగారు.

Related posts