telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

అంటూ వ్యాధులు సోకకుండా అన్ని చర్యలు…

హైదరాబాద్ నగరంలో అంటూ వ్యాధులు సోకకుండా అన్ని చర్యలు తీసుకున్నామని జీహెచ్ఎంసీ డిజాస్టర్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ పేర్కొన్నారు. వరదల నేపథ్యంలో నగరంలో 2,540 మందిని కాపాడామని.. ఆహారం, తాగునీరు అందకుండా ఇళ్లలోనే ఉండిపోయిన ప్రజలకు సహాయక చర్యలు చేశామని తెలిపారు. సెల్లార్లలో నీటిని తోడేందుకు 72 డీవాటరింగ్ బృందాలు పనిచేస్తున్నాయని..నగరంలో వరదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 6 బోట్లతో క్షేత్రస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టామన్నారు. 202 సెల్లార్లలో నీటిని తోడి…విద్యుత్ ను పునరుద్దరించేందుకు సహాయక చేశామని..ఆసుపత్రులు, సబ్ స్టేషన్లతో నీటిని తోడేందుకు మొదట ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. 105 డీవాటరింగ్ పంపులు వీటికోసం పనిచేస్తున్నాయని.. అవసరం అయిన చోట్ల రోడ్లపై పేరుకున్న చెత్తను తరలించేందకు మెషినరీని ఉపయోగిస్తున్నామని తెలిపారు. నగరంలో 390 చెట్లు నేలకూలిన చెట్లను 19 డీఆర్ఎఫ్ బృందాలు తరలించాయని..వర్షాలు., వరదల నేపథ్యంలో డీఆర్ఎఫ్ వచ్చిన 645 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. వరదల అనంతరం అంటూ వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

Related posts