telugu navyamedia
రాజకీయ వార్తలు

తమ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉంటుంది: ఉద్ధవ్ థాకరే

uddhav-thackeray-shivasena

రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తున్నట్టు ఆరోపణలు వెళ్ళు విరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీకి దమ్ముంటే తన ప్రభుత్వాన్ని కూల్చాలని సవాలు విసిరారు. తమ ప్రభుత్వం పూర్తి ఐదేళ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బీజేపీతో తన ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. చైనాతో విభేదాలపై స్పందిస్తూ అంతర్జాతీయ సంబంధాల విషయంలో కేంద్రానికి స్పష్టమైన వైఖరి ఉండాలని అన్నారు. ప్రస్తుతం మనం చైనాను వ్యతిరేకిస్తున్నప్పటికీ భవిష్యత్తులో అదే మనకు మిత్ర దేశంగా మారే అవకాశాలను కొట్టిపడేయలేమని వ్యాఖ్యానించారు.

Related posts